Rishabh Pant | టీం ఇండియా (Team India) అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి క్రికెట్కు దూరమైన టీం ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ప్రస్తుతం రీ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫిట్నెస్ కోసం కష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతేడాది డిసెంబర్ 30వ తేదీన పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. దీంతో పంత్ తిరిగి ఎప్పుడు జట్టులోకి చేరుతాడా..? అంటూ అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంత్ వచ్చే ఏడాది ప్రారంభంలోనే తిరిగి తన ఆటను మొదలు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకైన గాయాలు పూర్తిగా నయమైనట్లు తెలుస్తోంది. దీంతో పంత్ తిరిగి తన ఫిట్నెస్ కోసం కష్టపడుతున్నాడు.
దీంతో పంత్కు తిరిగి జట్టులో అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ( BCCI) కూడా భావిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ ( England Test series) లో పంత్ను ఆడించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలంగా ఉంటే వచ్చే ఏడాది ప్రారంభంలో పంత్ తిరిగి భారత జట్టులోకి చేరతాడన్నమాట.
Also Read..
Burj Khalifa | బుర్జ్ ఖలీఫాపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.. వీడియో
Gas Station | పెట్రోల్ స్టేషన్లో భారీ పేలుడు.. 12 మంది మృతి
Light Field Guns: ఎర్రకోట వేడుకల్లో స్వదేశీ లైట్ ఫీల్డ్ గన్స్తో ఫైరింగ్.. వీడియో