ODI Rankings : స్వదేశంలో ఆస్ట్రేలియా(Australia) చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయిన టీమిండియా(TeamIndia)కు షాక్. వన్డేల్లో అగ్రస్థానం చేజారింది. సొంతగడ్డపై నాలుగేళ్ల తర్వాత వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ రెండో స్థానానికి పడిపోయింది. వన్డే సిరీస్ విజయంతో ఆసీస్ మొదటి ర్యాంకుకు ఎగబాకింది.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్, పాకిస్థాన్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. స్వదేశంలో ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ ఏడో ప్లేస్ సాధించింది.
ఈ ఏడాది శ్రీలంక, న్యూజిలాండ్ను చిత్తు చేసిన టీమిండియా జనవరిలో వన్డేల్లో అగ్రస్థానానికి చేరింది. అయితే.. చెన్నైలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. దాంతో, 1-2తో సిరీస్తో పాటు వన్డేల్లో నంబర్ 1 ర్యాంకు కూడా పోగొట్టుకుంది. సొంతగడ్డపై భారత జట్టు వన్డే సిరీస్ చేజార్చుకొని దాదాపు నాలుగేళ్లవుతోంది. 2019లో ఆసీస్ 3-2తో ఇండియాను ఓడించి సిరీస్ దక్కించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 269 రన్స్ చేసింది. 270 లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ (54) ఒంటిపోరాటం చేశాడు. ఆడమ్ జంపా స్పిన్ మ్యాజిక్తో టీమిండియాను దెబ్బకొట్టాడు.
Champions of the #INDvAUS ODI series and the No.1 team in the @MRFWorldwide ICC Men’s ODI Team Rankings 🏆
More ➡️ https://t.co/PGTfOUZZYR pic.twitter.com/oTTbF1bUP3
— ICC (@ICC) March 23, 2023