చెన్నై : భారత్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను ఆస్ట్రేలియా(Australia) కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే చెన్నైలో జరిగిన మూడవ వన్డేలో విక్టరీ తర్వాత ఆసీస్ జట్టు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నది. ట్రోఫీ అందుకున్న సమయంలో వార్నర్(Warner) తనదైన స్టయిల్లో ఎంజాయ్ చేశాడు. పుష్ప చిత్రంలోని తగ్గేదే లే(Thaggedele) అన్న ఫేమస్ డైలాగ్ కొట్టే సమయంలో హీరో ఇచ్చే ఫోజును వార్నర్ ఇమిటేట్ చేశాడు. ప్లేయర్లతో గ్రూపు ఫోటో దిగిన సమయంలో వార్నర్.. తగ్గేదేలే అంటూ ఆ ఫోజులో హల్చల్ చేశాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కూడా పుష్ప చిత్రం(Pushpa film)లో హీరో నడిచినట్లు వార్నర్ తన యాక్షన్లో చూపించాడు.
Gd morning 🖤🖤#Warner and #Pushpa … A never ending story 🔥🔥@alluarjun
@davidwarner31 co fan 😅 pic.twitter.com/NcIkuFBEFM— Stylish 🌟 Shiva goud AA Dhf (@ShivagoudAA) March 23, 2023
బుధవారం చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డే(3rd ODI)లో భారత్ 21 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. ఫలితంగా సొంత ఇలాఖాలో నాలుగేండ్ల తర్వాత తొలి సిరీస్ ఓటమిని చవిచూసింది. ఆసీస్ నిర్దేశించిన 270 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా(Teamindia) 49.1 ఓవర్లలో 248 పరుగులకు పరిమితమైంది. విరాట్ కోహ్లీ(54), హార్దిక్ పాండ్యా(40) చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచారు. ఆడమ్ జంపా(4/45) నాలుగు వికెట్లతో విజృంభించాడు. తొలుత ఆసీస్ 49 ఓవర్లలో 269 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(47) టాప్ స్కోరర్గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా (3/44), కుల్దీప్ యాదవ్(3/56) మూడేసి వికెట్లు తీశారు. జంపాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, మార్ష్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి.