న్యూఢిల్లీ: త్వరలో మొదలుకాబోతున్న ఐపీఎల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. గతంలో లాగా కాకుం డా టాస్ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు తమ తుది జట్లను ప్రకటించవచ్చు. దీనికి తోడు క్లాజ్ 1.2.9 ప్రకారం మ్యాచ్ మొదలయ్యే సమయానికి ప్రత్యర్థి కెప్టెన్ను సంప్రదించకుండా ఫైనల్ లెవన్లోనూ మార్పులు చేసే అవకాశముంటుంది.
బ్యాటర్ బంతిని ఆడే ముందు వికెట్కీపర్ అటుఇటుగా కదిలే ప్రయత్నం చేస్తే అంపైర్ డెడ్బాల్గా ప్రకటించడంతో పాటు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు. నిర్ణీత సమయంలో ఓవర్ వేయకపోతే 30 గజాల అవతల నలుగురు ఫీల్డర్లకు మాత్రమే ఫీల్డింగ్ చేసే చాన్స్ ఉంటుంది.