Team India : దక్షిణాఫ్రికా పర్యటన(South Africa Tour)లో తొలి టెస్టులో కంగుతిన్న భారత జట్టు(Team India) ఇప్పుడు సిరీస్ సమం చేయడంపై దృష్టి పెట్టింది. సిరీస్లో కీలకమైన రెండో టెస్టులో సమిష్టి ప్రదర్శనతో రాణించాలని రోహిత్ శర్మ బృందం పట్టుదలతో ఉంది.
కొత్త ఏడాదిలో జనవరి 3న జరిగే ఈ టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు కేప్టౌన్(Kape Town) బయలుదేరారు. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు సభ్యులు విమానాశ్రయంలో ఉన్న వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. సెంచూరియన్ పిచ్తో పోల్చితే కేప్టౌన్ పరిస్థితులు పేస్ బౌలర్లకు మరింత సహకరించనుంది. దాంతో, రబాడ(Rabada) నేతృత్వంలోని సఫారీ పేస్ దళాన్ని రోహిత్ సేన ఏమేరకు ఎదుర్కొంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
📍Cape Town#TeamIndia have arrived for the second #SAvIND Test 👌🏻👌🏻 pic.twitter.com/VGCTdk7yzO
— BCCI (@BCCI) January 1, 2024
సెంచూరియన్లో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా(South Africa) భారీ విజయం సాధించింది. బౌలింగ్కు సహకరించిన పిచ్పై పేసర్లు రబడ, బర్గర్ చెలరేగడంతో ఇన్నింగ్స్ 32 పరుగులతో గెలుపొందింది. 163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ సేన 133 పరుగులకే కుప్పకూలింది.
విరాట్ కోహ్లీ(76) ఒంటరి పోరాటం చేసినా ఇన్నింగ్స్ ఓటమి తప్పించలేకపోయాడు. జాన్సెన్ ఓవర్లో భారీ షాట్ ఆడిన కోహ్లీ.. బౌండరీ వద్ద రబాడ చేతికి చిక్కాడు. దాంతో ప్రొటిస్ జట్టు రెండు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అరంగేట్రంలోనే బర్గర్ 7 వికెట్లతో మెరవగా.. రబడ కూడా ఏడు వికెట్లతో సత్తా చాటాడు.