Deepika Kumari | ఢిల్లీ: రెండ్రోజుల క్రితమే షాంఘై వేదికగా ముగిసిన ఆర్చరీ వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్-1లో మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో రజతం గెలిచిన భారత సీనియర్ రికర్వ్ ఆర్చర్ దీపికా కుమారి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో చోటు దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఉన్న మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంవోసీ) సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది.
గతేడాది బిడ్డకు జన్మనివ్వడంతో ఆటకు దూరమైన దీపిక.. ఇటీవల దేశవాళీతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణిస్తోంది. దీపికతో పాటు మరో ఆర్చర్ మృణాల్ చౌహాన్, స్కాష్ ప్లేయర్లు అనంత్ సింగ్, అభయ్ సింగ్, వెలవన్ సెంథిల్ కుమార్నూ టాప్స్లో చేర్చుతున్నట్టు ఎంవోసీ ప్రకటనలో పేర్కొంది.