Champions Trophy | లాహోర్: వచ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో వేదికలను పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఖరారు చేసింది. పాక్లోని ప్రఖ్యాత లాహోర్ (గడాఫీ), కరాచీ (నేషనల్ స్టేడియం), రావల్పిండి స్టేడియాలలో మ్యాచ్ల నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్టు పీసీబీ చీఫ్ మోహిసీన్ నఖ్వీ తెలిపాడు.
ఈ స్టేడియాలలో వసతులు, అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు కల్పించేందుకు గాను అభివృద్ధి పనులు చేపట్టామని, వాటిని రాబోయే నాలుగైదు నెలల్లో పూర్తిచేశామని వెల్లడించాడు. దీనిపై ఐసీసీ అధికారిక ప్రకటన వెలువరించాల్సి ఉంది.