Team India : వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు భారత జట్టు(Team India)కు వన్డేల్లో వరల్డ్ నంబర్ 1 అయ్యే చాన్స్ వచ్చింది. ఆస్ట్రేలియా(Australia)తో రేపటి నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్ రూపంలో టీమిండియాకు సువర్ణావకాశం దొరికింది. తొలి వన్డేలో కంగారూలను ఓడిస్తే పాకిస్థాన్(Pakistan)ను వెనక్కి నెట్టి ఇండియా అగ్రస్థానానికి చేరే అవకాశం ఉంది. ఒకవేళ సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే ప్రపంచ కప్ పోటీల్లో భారత్ నంబర్ 1 జట్టుగా బరిలోకి దిగనుంది. ఇప్పటికే టీమిండియా టెస్టులు, టీ20ల్లో నంబర్ 1 ర్యాంకులో ఉన్న విషయం తెలిసిందే.
అయితే.. తొలి రెండు వన్డేలకు కేఎల్ రాహుల్(KL Rahul) సారథ్యం వహిస్తున్నాడు. పైగా రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli), హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, సిరాజ్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఈ రెండు మ్యాచుల్లో ఆడడం లేదు. దాంతో, రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, షమీ వంటి సీనియర్లతో కూడిన ఇండియా ఆసీస్ను ఎలా కట్టడి చేస్తారు? అని అందరిలో ఆసక్తి నెలకొంది.
మరోవైపు.. దక్షిణాఫ్రికా గడ్డపై ఆసీస్ బ్యాటర్లు దంచి కొట్టారు. వన్డే సిరీస్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్ సెంచరీలతో చెలరేగారు. అయితే.. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్(Glenn Maxwell) గాయంతో తొలి వన్డేకు దూరం అయ్యారు. దాంతో, రాహుల్ సేనకు ఆస్ట్రేలియాను ఓడించేందుకు ఇది మంచి చాన్స్.
ఆసియా కప్(Asia Cup 2023) ముందు పాకిస్థాన్ జట్టు వన్డేల్లో నంబర్ 1 ర్యాంకు దక్కించుకుంది. భారత్, ఆస్ట్రేలియా వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా కప్ ఫైనల్లో పేసర్ సిరాజ్(Mohammad Siraj) 6 వికెట్లతో శ్రీలంక(Srilanka)ను హడలెత్తించాడు.
ఆసియా కప్ ఫైనల్లో 6 వికెట్లతో చెలరేగిన సిరాజ్
సిరాజ్ ధాటికి లంక 50 పరుగులకే కుప్పలకూలింది. స్వల్ప లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా చేధించిన భారత్ ఎనిమిదోసారి చాంపియన్గా నిలిచింది. సొంత గడ్డపై ప్రపంచ కప్ ముందు ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలు పంపింది.