Sreeshath : టాలెంట్ ఉన్నా కూడా జట్టులోకి వచ్చీ పోతుండే ఆటగాళ్లలో సంజూ శాంసన్(Sanju Samson) ఒకడు. కానీ, ఈసారి మాత్రం అతడు మళ్లీ భారత జట్టులోకి రావడం కష్టమే. వరల్డ్ కప్ స్క్వాడ్(ODI World Cup 2023)తో పాటు ఆస్ట్రేలియా (Australia)తో వన్డే సిరీస్కు కూడా సెలెక్టర్లు శాంసన్ను పక్కన పెట్టేశారు. దాంతో సంజూ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఈ సమయంలో మాజీ పేసర్ శ్రీశాంత్(S Sreeshath) సంజూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పిచ్ను అర్థం చేసుకొని, అందుకు తగ్గట్టు ఆడాలని ఎన్నిసార్లు చెప్పినా శాంసన్ వినలేదని అన్నాడు. ‘నేను శాంసన్ను కలిసిన ప్రతిసారి ఒకటే చెప్పేవాడిని. సంజూ పిచ్ను అర్థం చేసుకోమని. పరిస్థితులను బట్టి ఆడాలని అతడికి పదే పదే చెప్పాను. కానీ, అతడు వినలేదు. ఒకవేళ శాంసన్ గనుక అలా చేసి ఉంటే అతడి కెరీర్ మరోలా ఉండేది’ అని శ్రీశాంత్ వెల్లడించాడు.
అంతేకాదు ఒకప్పుడు శాంసన్ను కేరళ జట్టులోకి తీసుకోవాలనుకున్నానని, అప్పుడు అందరూ తనను ప్రశ్నించారని ఈ మాజీ స్టీడ్స్టర్ తెలిపాడు. 2007లో వరల్డ్ కప్(T20 World Cup 2007) నెగ్గిన టీమిండియాలో శ్రీశాంత్ సభ్యుడు. అయితే.. ఈ స్టార్ పేసర్ ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్(Match Fixing) పాల్పడి కెరీర్ను చేజేతులా నాశనం చేసుకున్నాడు.
సంజూ శాంసన్
కేరళ స్టార్ శాంసన్కు దేశవాళీ, ఐపీఎల్(IPL) టోర్నీల్లో గొప్ప రికార్డు ఉంది. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కెప్టెన్గా కొనసాగుతున్న సంజూ 2022లో జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు. కానీ, దేశం తరఫున ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారి తీవ్రంగా నిరాశపరిచాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్క భారీ ఇన్నింగ్స్తో గెలిపించలేకపోయాడు. ఈ మధ్యే వెస్టిండీస్ టూర్(West Indies Tour)తో మళ్లీ బ్లూ జెర్సీ వేసుకున్న ఈ పవర్ హిట్టర్ పేలవ ఫామ్తో విమర్శలపాలయ్యాడు. వరుసగా విఫలమై కెప్టెన్, కోచ్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. దాంతో, అతడిని సెలెక్టర్లు వరల్డ్ కప్ స్క్వాడ్లోకి తీసుకోలేదు.