Asian Games 2023 : భారత మహిళల జట్టు(Indian Womens Team) ఆసియా గేమ్స్(Asian Games 2023) సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఈరోజు మలేషియా(Malaysia)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దాంతో టీమిండియా సెమీస్కు చేరింది. మొదట డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ(67), జెమీమా రోడ్రిగ్స్(47 నాటౌట్) వీర బాదుడు బాదడంతో భారత్ 173 రన్స్ కొట్టింది. మలేషియా ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే వాన పడింది. దాంతో, రిఫరీలు భారత్ను విజేతగా ప్రకటించారు.
భారత్, మలేషియా మ్యాచ్కు వరుణుడు ఆదిలోనే అడ్డుపడ్డాడు. దాంతో, టాస్ ఆలస్యంగా వేశారు. టాస్ గెలిచిన మలేషియా కెప్టెన్ వినిఫ్రెడ్ దురాయ్ సింగమ్(Winfred Duraisingam) రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఈజీ అవుతుందని ఫీల్డింగ్ తీసుకుంది. కానీ, టీమిండియా ప్లేయర్లు ధనాధన్ ఆటతో చెలరేగారు. కెప్టెన్ స్మృతి మంధానా(27), డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ(67 బ39 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లు) తొలి వికెట్కు 60 రన్స్ జోడించారు.
Women’s Cricket Day 1⃣ at the #AsianGames
The weather’s interference led to a halt in today’s match between India and Malaysia.
Despite this, team 🇮🇳 advances to the semi-finals, thanks to their higher ranking 🥳
Looking forward to the team’s semis encounter!#HallaBol… pic.twitter.com/CrmPE5ScEA
— SAI Media (@Media_SAI) September 21, 2023
మంధాన ఔటయ్యాక వేగం పెంచిన షఫాలీ హాఫ్ సెంచరీతో చెలరేగింది. జెమీమా రోడ్రిగ్స్(47 నాటౌట్), రీచా ఘోష్(21 నాటౌట్) కూడా దంచడంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 173 పరుగలు చేసింది. అయితే.. మలేషియా జట్టు ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే వర్షం మళ్లీ మొదలైంది. వాన ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు భారత్ను విజేతగా ప్రకటించారు.
హర్మన్ప్రీత్ కౌర్
తొలిసారి ఈ మెగా టోర్నీలో ఆడుతున్న భారత జట్టు టైటిల్పై కన్నేసింది. సెమీస్ పోరుకు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అందుబాటులో ఉండనుంది. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో దురుసు ప్రవర్తనతో హర్మన్ప్రీత్పై ఐసీసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే.