Asian Games 2023 : భారత ఫుట్బాల్ జట్టు(Indian Football Team) ఆసియా గేమ్స్(Asian Games 2023)లో బోణీ కొట్టింది. నాకౌట్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో బంగ్లాదేశ్(Bangladesh)పై అద్భుత విజయం సాధించింది. ఈరోజు హోరాహోరీగా జరిగిన పోరులో 1-0తో బంగ్లాను చిత్తు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. దాంతో, నాకౌట్(knock out) ఆశలు సజీవంగా ఉంచుకుంది. సెప్టెంబర్ 24న భారత జట్టు మయన్మార్ను ఢీకొట్టనుంది.
తొలి మ్యాచ్లో ఆతిథ్య చైనా(China) చేతిలో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. చైనా ఆటగాళ్ల దూకుడుకు కళ్లెం వేయలేక 1-5 తో మ్యాచ్ చేజార్చుకుంది. భారత ఆటగాడు రాహుల్ కేపీ(Rahul KP) ఒక్కడే గోల్ చేశాడు. మిగతావాళ్లంతా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. అయితే.. సొంత గడ్డపై వరుస విజయాలు సాధించిన భారత జట్టు తొందరగానే తేరుకొని రెండో మ్యాచ్లో అనూహ్యంగా పుంజుకుంది. బంగ్లాదేశ్ను ఓడించి నాకౌట్ పోటీలో నిలిచింది. 83వ నిమిషంలో ఛెత్రీ పెనాల్టీని గోల్గా మలిచాడు. దాంతో, ఇండియా ఆసియా గేమ్స్లో బోణీ కొట్టింది.