ODI World Cup 2023 : ప్రపంచ కప్ పోటీలకు సన్నద్ధమవుతున్న దక్షిణాఫ్రికా(South Africa,) జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ప్రధాన పేసర్లు అన్రిచ్ నార్ట్జ్(Anrich Nortje), సిసండ మగల(Sisanda Magala) గాయంతో టోర్నీ నుంచి వైదొలిగారు. దాంతో, నార్ట్జ్, మగల స్థానంలో అండిలే పెహ్లూవాకియో(Andile Phehlukwayo), లిజాద్ విల్లియమ్స్(Lizaad Williams)లను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సఫారీ జట్టు కోచ్ రాబ్ వాల్టర్(Rob Walter) వెల్లడించాడు.
‘అన్రిచ్, మగల వరల్డ్ కప్ టోర్నీకి దూరం కావడం తీవ్ర నిరాశకు గురిచేసింది. వీళ్లిద్దరూ నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు. దక్షిణాఫ్రికా బౌలింగ్ యూనిట్కు వెన్నెముక లాంటివాళ్లు. ఈ ఇద్దరూ తొందరగా కోలుకునేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం’ అని వాల్టర్ ఓ ప్రకటనలో తెలిపాడు.
🟡 #CWC23 TEAM UPDATE 🟢
White-ball head coach Rob Walter today confirmed that Anrich Nortje & Sisanda Magala have been ruled out of the @cricketworldcup in India 🇿🇦🏆
✅ Andile Phehlukwayo & Lizaad Williams
❌Sisanda Magala & Anrich Nortje #BePartOfIt pic.twitter.com/WhDiCNDNjY
— Proteas Men (@ProteasMenCSA) September 21, 2023
అన్రిచ్, మగల ఇద్దరూ తాజాగా ఆస్ట్రేలియా(Australia)తో ముగిసిన వన్డే సిరీస్(ODI Series)లో గాయపడ్డారు. రెండో వన్డే ముగిశాక నార్ట్జ్ వెన్ను నొప్పి వస్తుందని మేనేజ్మెంట్కు చెప్పాడు. దాంతో, అతడికి స్కానింగ్ నిర్వహించారు. ఇక మగల మోకాలి గాయంతో బాధ పడుతున్నట్టు వెల్లడించాడు. అందుకని సెలెక్టర్లు ఈ ఇద్దరిని వరల్డ్ కప్ స్క్వాడ్ 15 మంది జాబితా నుంచి తప్పించారు.
ఇప్పటివరకూ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవని సఫారీ జట్టు ఈసారి ట్రోఫీ కలను నిజం చేసుకోవాలనుకుంది. కానీ, టోర్నీ ప్రారంభానికి ముందే ప్రధాన పేసర్లు ఇంటిదారి పట్టడం ఆ జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. అక్టోబర్ 5న భారత్లో ప్రపంచ కప్ పోటీలు షురూ కానున్నాయి. తెంబా బవుమా త్వంలోని సఫారీ జట్టు అక్టోబర్ 7న శ్రీలంకతో తలపడనుంది.