Team India : స్వదేశంలో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించిన భారత జట్టు(Team India) టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరింది. వరుసగా నాలుగు టెస్టుల్లో బెన్ స్టోక్స్ సేనను మట్టికరిపించిన టీమిండియా.. 122 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 ర్యాంక్ కైవసం చేసుకుంది. దాంతో, 117 రేటింగ్ పాయింట్స్ ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోయింది. భారత్ చేతితో చావు దెబ్బ తిన్న ఇంగ్లండ్ 111 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
రోహిత్ సేన సారథ్యంలోని టీమిండియా 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023-25) పట్టికలోనూ అగ్రస్థానం దక్కించుకుంది. డబ్ల్యూటీసీ సిరీస్లో భారత్కు ఇంకా ఐదు టెస్టులు ఉన్నాయంతే. ఈ ఏడాది స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో జరిగే ఐదు టెస్టుల సిరీస్లో భారీ తేడాతో గెలిస్తే టీమిండియా ఫైనల్ చేరే చాన్స్ ఉంది.
A comprehensive win in Dharamsala for India 👏#WTC25 | #INDvENG 📝: https://t.co/0sc3mQ50r4 pic.twitter.com/rTEKyGQdbr
— ICC (@ICC) March 9, 2024
నామమాత్రమైన ధర్మశాల టెస్టులోనూ స్టోక్స్ సేనను మట్టికరిపించి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఈ సిరీస్లో ఇంగ్లండ్పై భారత కుర్రాళ్లు శివతాండవం చేశారు. సీనియర్ల స్థానాన్ని తాము భర్తీ చేయగలమనే భరోసా కల్పించారు. యశస్వీ జైస్వా ల్(Yashasvi Jaiswal), శుభ్మన్ గిల్లు తమ సత్తాను చాటుకోగా.. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(Dhruv Jurel)లు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడుతూ పరుగుల వరద పారించి.. భారత జట్టు రికార్డు విజయంలో భాగమయ్యా రు.
𝙒.𝙄.𝙉.𝙉.𝙀.𝙍.𝙎! 🏆
Congratulations #TeamIndia on winning the @IDFCFIRSTBank #INDvENG Test Series 4⃣-1⃣ 👏👏 pic.twitter.com/IK3TjdapYv
— BCCI (@BCCI) March 9, 2024
నిరుడు వెస్టిండీస్పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన యశస్వీ జైస్వాల్ రెండు డబుల్ సెంచరీలో చెలరేగాడు. అంతేకాదు ఒకే సిరీస్లో అత్యధికంగా 26 సిక్సర్లతో రికార్డులు బద్ధలు కొట్టాడు. తొమ్మిది ఇన్నింగ్స్ల్లో 712 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్లో మూడో స్థానంలో ఆడిన గిల్.. విరాట్ కోహ్లీ(Virat Kohli) లోటును పూడ్చేందుకు అపసోపాలు పడ్డాడు. చివరకు రాజ్కోట్, రాంచీ టెస్టులో బ్యాట్ ఝులిపించాడు. ధర్మశాలలోనూ సెంచరీతో కదం తొక్కిన గిల్.. 452 పరుగులతో రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు.
WHAT A TEAM IS INDIA IS RIGHT NOW SEEM UNSTOPPABLE 🔥🔥🔥 pic.twitter.com/7zeFo9jBGD
— Haider🤴 (@haidersa20) March 9, 2024
శ్రేయస్ అయ్యర్ వైఫల్యంతో రాజ్కోట్లో అరంగేట్రం చేసిన రంజీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్ రఫ్పాడించాడు. ఇంగ్లండ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మూడు హాఫ్ సెంచరీలతో రాణించాడు. మరో కుర్రాడు ధ్రువ్ జురెల్ ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్లు ఆడగలని నిరూపించుకున్నాడు. రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో (96) హాఫ్ సెంచరీతో జట్టును గట్టెక్కించిన అతడు .. రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్తో కలిసి భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. ఏడో స్థానంలో తాను సరిపోతానని చాటడమే కాకుండా వికెట్ కీపింగ్లోనూ శ్రీకర్ భరత్ కంటే మెరుగ్గా కనిపించాడు.