Giriraj Singh | బెగుసరాయ్: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్యాగాలు చేయడానికి అసలు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్ నేత సోనియా గాంధీలకు మంగళసూత్రాలు ఉన్నాయా? అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల మంగళసూత్రాలు, బంగారాన్ని గుంజుకుపోతుందని ప్రధాని మోదీ చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేత ప్రియాంక స్పందిస్తూ.. తన తండ్రి రాజీవ్ గాంధీని కోల్పోవడం ద్వారా తన తల్లి సోనియా మంగళ సూత్రాన్ని త్యాగం చేశారని, తన నానమ్మ ఇందిరా గాంధీ కూడా ప్రాణాలను అంకితం చేశారన్నారు.
ప్రియాంక వ్యాఖ్యలపై గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ ‘ఇటలీ నుంచి వచ్చిన సోనియాకు మంగళసూత్రం ఉంటుందో లేదో నాకే తెలియదు. అలాగే ఇందిరా గాంధీని పెళ్లాడిన ఫిరోజ్ గాంధీ పార్సీ మతస్తుడు’ అని వ్యాఖ్యలు చేశారు.