ముంబై, ఏప్రిల్ 27: ్ర ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.11,672 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.9,853 కోట్ల లాభంతో పోలిస్తే 18.5 శాతం వృద్ధి కనబరిచింది. నికర వడ్డీ ఆదాయం 8.1 శాతం పెరిగి రూ.19,093 కోట్లకు చేరుకున్నది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.718 కోట్ల నిధులను వెచ్చించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను బ్యాంక్ ప్రతిషేరుకు రూ.10 డివిడెండ్ను ప్రకటించింది. ఈ డివిడెండ్కు వాటాదారులు అనమతించాల్సి ఉంటుంది.