IND vs ENG : బర్మింగ్హమ్లో సంచలన విజయంతో సిరీస్ సమం చేసిన భారత జట్టు (Team India) లార్డ్స్లోనూ గెలుపు వాకిట నిలిచింది. నాలుగో రోజు బౌలర్ల విజృంభణతో ఇంగ్లండ్ ఆటగాళ్లు డగౌట్కు క్యూ కట్టారు. తొలి సెషన్లో సిరాజ్(2-31) నిప్పులు చెరిగితే లంచ్ తర్వాత వాషింగ్టన్ సుందర్ (4-22) ఆతిథ్య జట్టు నడ్డివిరిచాడు. డేంజరస్ జో రూట్(40), బెన్ స్టోక్స్(33), జేమీ స్మిత్(8)లను క్లీన్బై టీ బ్రేక్ అనంతరం జస్ప్రీత్ బుమ్రా(2-38) వికెట్ల వేట కొనసాగించాడు. బషీర్ను సుందర్ బౌల్డ్ చేయడంతో రెండో ఇన్నింగ్స్లో192కే ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు తెరపడింది.
తొలి రోజు నుంచి ఉత్కంఠగా సాగుతున్న లార్డ్స్ టెస్టులో భారత జట్టు విజయానికి చేరువైంది. పేస్ బౌలర్లు నిప్పులు చెరిగడంతో బజ్ బాల్ ఆటకు బ్రేకిచ్చి.. ఆత్మరక్షణలో పడిపోయిన ఇంగ్లండ్ ఆలౌటయ్యింది. సిరాజ్ పేస్కు తొలి సెషన్ ఆరంభంలోనే ఓపెనర్ బెన్ డకెట్(12), ఓలీ పోప్(4)లు పెవిలియన్ చేరారు. జోరు పెంచాలనుకున్న జాక్ క్రాలే(22)ను నితీశ్ బోల్తా కొట్టించాడు. లంచ్కు ముందు స్కూప్ షాట్లతో చెలరేగిన హ్యారీ బ్రూక్(23)ను బౌల్డ్ చేసిన ఆశాశ్ దీప్ ఇంగ్లండ్కు షాకిచ్చాడు.
Innings Break!
Outstanding bowling display from #TeamIndia! 👏 👏
4⃣ wickets for Washington Sundar
2⃣ wickets each for Mohammed Siraj & Jasprit Bumrah
1⃣ wicket each for Akash Deep & Nitish Kumar ReddyIndia need 193 runs to win!
Updates ▶️ https://t.co/X4xIDiSmBg… pic.twitter.com/1BRhfPzynv
— BCCI (@BCCI) July 13, 2025
కీలక బ్యాటర్లు ఔటైనా.. కెప్టెన్ బెన్ స్టోక్స్(33)తో కలిసి జో రూట్(40) క్రీజులో పాతుకుపోయాడు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ఈ ద్వయం స్కోర్ 150 దాటించింది. ఐదో వికెట్కు 67 పరుగులు జోడించిన ఈ జోడీని సుందర్ విడదీశాడు. స్వీప్ షాట్ కొట్టే యత్నంలో క్లీన్బౌల్డ్ అయ్యాడు రూట్. దాంతో, 154 వద్ద ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయింది.
అనంతరం వచ్చిన జేమీ స్మిత్ (8)ను కూడా సుందర్ బౌల్డ్ చేయగా ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది. టీ బ్రేక్ వరకూ క్రిస్ వోక్స్(8 నాటౌట్) తో కలిసి వికెట్ పడకుండా ఆడిన స్టోక్స్ను సుందర్ బౌల్డ్ చేసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. యార్కర్లతో టెయిలెండర్లను బుమ్రా డగౌట్ చేర్చగా.. షోయబ్ బషీర్ను బౌల్డ్ చేసిన సుందర్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు తెరదించాడు.