ఈ ఐపీఎల్లో ఓటమి లేకుండా సాగుతున్న గుజరాత్ టైటన్స్కు ఓటమి రుచి చూపించింది సన్రైజర్స్ హైదరాబాద్. సమిష్టిగా రాణిస్తే ఎలాంటి జట్టునైనా ఓడించవచ్చని మరోసారి నిరూపించింది. తొలుత బౌలర్లు రాణించడంతో గుజరాత్ జట్టును 162/7 స్కోరుకు కట్టడి చేసిన సన్రైజర్స్.. ఆ తర్వాత ఓపెనర్లు అభిషేక్ శర్మ (42), కేన్ విలియమ్సన్ (57) రాణించడంతో విజయం దిశగా సాగింది.
రాహుల్ త్రిపాఠి (17) రిటైర్ట్ హర్ట్గా మైదానం వీడటంతో.. క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (34 నాటౌట్) కూడా రాణించడంతో సన్రైజర్స్ గెలుపు లాంఛనమే అయ్యింది. అతనికి జత కలిసిన ఎయిడెన్ మార్క్రమ్ (12 నాటౌట్) చక్కని సహకారం అందించడంతో చివరి ఓవర్లో సన్రైజర్స్ విజయానికి కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరం అయింది.
దర్షన్ నల్కండే వేసిన ఆ ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాదిన పూరన్.. సన్రైజర్స్కు విజయాన్ని కట్టబెట్టాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, హార్దిక్ పాండ్ాయ చెరో వికెట్ తీశారు. మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
Nicholas Pooran hits the winnings runs as @SunRisers win by 8 wickets against #GujaratTitans
Scorecard – https://t.co/phXicAbLCE #SRHvGT #TATAIPL pic.twitter.com/F5o01VSEHv
— IndianPremierLeague (@IPL) April 11, 2022