Duleep Trophy : సౌత్ జోన్ (South Zone)జట్టు ఈ ఏడాది దులీప్ ట్రోఫీ(Duleep Trophy) చాంపియన్గా నిలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి(Chinna Swami) స్టేడియంలో హోరా హోరీగా జరిగిన ఫైనల్లో వెస్ట్ జోన్ను 75 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన సౌత్ జోన్ జట్టు ఫైనల్లోనూ అత్యుత్తమ ఆట కనబరిచింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ట్రోఫీని ఎగరేసుకుపోయింది. సౌత్ జోన్ ఈ ట్రోఫీ నెగ్గడం ఇది పద్నాలుగో సారి.
298 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్ట్ జోన్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆఫ్ స్పిన్నర్ సాయి కిశోర్ (Sai Kishore), పేసర్ వాసుకి కౌశిక్(Vasuki Koushik) దెబ్బకు 222 పరుగులకే కుప్పకూలింది. దాంతో, నిరుడు ఫైనల్లో వెస్ట్ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
WHAT. A. WIN 🙌🙌
South Zone beat West Zone by 75 runs to lift the #DuleepTrophy at the M Chinnaswamy Stadium in Bengaluru 👏👏#WZvSZ | #Final
💻 Scorecard – https://t.co/ZqQaMA6B6M pic.twitter.com/mSuHfxIJ6w
— BCCI Domestic (@BCCIdomestic) July 16, 2023
వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పంచల్(95) పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఓవర్నైట్ స్కోర్ 92తో ఐదోరోజు బ్యాటింగ్కు వచ్చిన అతను మరో మూడు పరుగులు చేసి ఔటయ్యాడు. అక్కడితో వెస్ట్ జోన్ వికెట్ల పతనం మొదలైంది. అయితే..అతిత్ షేత్, ధర్మేంద్ర జడేజా ఎనిమిదో వికెట్కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ప్రియాంక్ పంచల్(95)