IND vs ENG : ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా మళ్లీ పట్టుబిగించే స్థితిలో నిలిచింది. టీ సెషన్ తర్వాత మహ్మద్ సిరాజ్ (6-74) నిప్పులు చెరిగాడు. కొత్త బంతితో చెలరేగిపోయిన స్పీడ్స్టర్ మొత్తంగా ఆరు వికెట్లతో ఇంగ్లండ్ నడ్డివిరిచాడు. లంచ్ లోపే సగం వికెట్లు కోల్పోయిని ఆతిథ్య జట్టు జేమీ స్మిత్(184), హ్యారీ బ్రూక్(158)ల సెంచరీలతో కోలుకుంది. అయితే.. ఆకాశ్ దీప్ ఓవర్లో బ్రూక్ బౌల్డ్ అయ్యాక టెయిలెండర్ల పని పట్టాడు సిరాజ్. అంతే.. చూస్తుండగానే మూడు వికెట్లు పడడంతో ఇంగ్లండ్ అనూహ్యంగా 407కే ఆలౌటయ్యింది. దాంతో, భారత జట్టుకు 180 పరుగులస్వల్ప ఆధిక్యం లభించింది.
ఎడ్జ్బాస్టన్ టెస్టు ఆద్యంతం రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు రోజులు టీమిండియా ఆధిపత్యం చెలాయించగా.. మూడోరోజు రెండె సెషన్లలో ఇంగ్లండ్ బ్యాటర్లు బజ్ బాల్ ఆటతో జోరు చూపించారు. మూడో తొలి సెషన్లోనే సిరాజ్ వరుస బంతుల్లో జో రూట్(22), కెప్టెన్ బెన్ స్టోక్స్(0) పెవిలియన్ పంపాడు. అంతే.. 85కే సగం వికెట్లు కోల్పోయింది ఆతిథ్య జట్టు. హ్యాట్రిక్ బాల్ను ఎదుర్కొన్న జేమీ స్మిత్(184).. క్రీజులో పాతుకుపోయాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలించడంతో హ్యారీ బ్రూక్(158)తో కలిసి చెలరేగిపోయాడీ వికెట్ కీపర్. ఆరో వికెట్కు కేవలం 303 పరుగులతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారిద్దరూ. వీరిద్దరి మెరుపులతో వికెట్ల పతనానికి బ్రేక్ పడగా.. లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 249 రన్స్ చేసింది. టీ సెషన్ తర్వాత బ్రూక్ సెంచరీ సాధించగా.. స్మిత్ 150 క్లబ్లో చేరాడు.
TIMBER!
A much-needed breakthrough for #TeamIndia! 👏
Akash Deep strikes to dismiss Harry Brook! 👍
Updates ▶️ https://t.co/Oxhg97fwM7#ENGvIND pic.twitter.com/e5QYOM4SRF
— BCCI (@BCCI) July 4, 2025
టీ సెషన్ తర్వాత ఆకాశ్ దీప్ భారత్కు బ్రేకిచ్చాడు. రెండో కొత్త బంతితో మ్యాజిక్ చేసిన ఆకాశ్ క్రీజులో పాతుకుపోయిన హ్యారీ బ్రూక్(158)ను బౌల్డ్ చేశాడు. దాంతో, ఆరో వికెట్కు 303 పరగులు రికార్డు భాగస్వామ్యానికి తెరపడింది. అంతకుముందు ఓవర్లోనే ఇబ్బంది పడిన బ్రూక్.. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని ఆడగా అది ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేసింది. దాంతో, భారత ఆటగాళ్ల ముఖంలో సంతోషం నిండింది. బ్రూక్ ఔటయ్యేసరికి ఇంగ్లండ్ స్కోర్ 387. ఇంకా ఆతిథ్య జట్టు 200 రన్స్ వెనకబడి ఉంది.
5⃣-Wicket Haul ✅
4th FIFER in Test cricket for Mohammed Siraj 👏 👏
Updates ▶️ https://t.co/Oxhg97fwM7 #TeamIndia | #ENGvIND | @mdsirajofficial pic.twitter.com/3aQ75gEpra
— BCCI (@BCCI) July 4, 2025
బ్రూక్ వికెట్ పడ్డాక టెయిలెండర్లతో ఆధిక్యాన్ని తగ్గించాలనుకున్న ఇంగ్లండ్కు.. ఆకాశ్ మరో షాకిచ్చాడు. ఫస్ట్ స్లిప్లో ఉన్న కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో వోక్స్ డగౌట్ చేరాడు. ఆ వెంటనే బ్రాండన్ కార్సేను సిరాజ్ ఎల్బీగా ఔట్ చేసి ఐదో వికెట్ సాధించాడు. తర్వాతి ఓవర్లోనే షోయబ్ బషీర్ను బౌల్డ్ చేసిన సిరాజ్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు తెరదించాడు. దాంతో, 407 పరుగుల వద్ద స్టోక్స్ సేన తొలి ఇన్నింగ్స్ ముగిసింది.