Virendra Sehwag : భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virendra Sehwag)కు అరుదైన గౌరవం లభించింది. క్రికెట్కు విశేష సేవలు అందించినందుకుగానూ వీరూకు ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్( ICC Hall of Fame)లో చోటు దక్కింది. అతడితో పాటు భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుజీ(Diana Edulji), శ్రీలంక లెజెండ్ అరవింద డిసిల్వా(Aravinda de Silva)లు ఈ గౌరవం దక్కించుకున్నారు. ‘ఈ గౌరవం లభించినందుకు గర్వంగా ఉంది. ఐసీసీకి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ప్రపంచంలోని విధ్వంసక ఓపెనర్లలో ఒకడిగా పేరొందిన సెహ్వాగ్ రెండు వరల్డ్ కప్లు గెలిచిన భారత జట్టులో సభ్యుడు. 1999 – 2013 మధ్య భారత్కు ప్రాతినిధ్యం వహించిన వీరూ 23 టెస్టు సెంచరీలు బాదాడు. అంతేకాదు టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 251 వన్డేల్లో 8,232 పరుగులు.. 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8,586 రన్స్ చేసిన సెహ్వాగ్.. బంతితోనూ రాణించి 40 వికెట్లు తీశాడు.
🇮🇳 🇱🇰 🇮🇳
Three stars of the game have been added to the ICC Hall of Fame 🏅
Details 👇https://t.co/gLSJSU4FvI
— ICC (@ICC) November 13, 2023
డయానా ఎడుజి భారత మహిళల క్రికెట్పై తన ముద్ర వేసింది. ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం పశ్చిమ రైల్వేలో పనిచేసిన ఆమె ఎందరో మహిళా క్రికెటర్లకు ఉపాధి అవకాశాలు కల్పించారు. అంతేకాదు భారత రైల్వేలో స్పోర్ట్స్ పాలసీలో సమూల మార్పులకు కారణమయ్యారు. దాంతో, ఎడుజి విశిష్ట సేవలను గుర్తిస్తూ అందుకుగానూ ఐసీసీ ఆమెను ఈ గౌరవానికి ఎంపిక చేసింది.
‘భారత మహిళా క్రికెటర్కు తొలిసారి ఈ గౌరవం దక్కడం గౌరవంగా భావిస్తున్నా’ అని 67 ఏండ్ల ఎడుజీ తెలిపింది. 1976 – 1993 మధ్య ఎడుజి 54 మ్యాచ్లు ఆడింది. 20 టెస్టులు, 34 వన్డేల్లో కలిపి 404 పరుగులు చేసింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గానూ రాణంచి 46 వికెట్లు తీసింది. ఇక.. లంక దిగ్గజం డిసిల్వా 19 ఏండ్ల కెరీర్లో 20 సెంచరీలు కొట్టాడు.