Rinku Singh | న్యూఢిల్లీ: వెస్టిండీస్, అమెరికా వేదికలుగా వచ్చే నెలలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి రింకూసింగ్ను ఎంపిక చేయకపోవడంపై కుటుంబసభ్యులు తీవ్ర నిరాశ చెందారు. మెగాటోర్నీ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 15 మందితో ఎంపిక చేసిన జట్టులో కాకుండా రింకూసింగ్ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో రింకూ తండ్రి కాన్చంద్రసింగ్ స్పందిస్తూ..
‘టీ20 ప్రపంచకప్ టోర్నీకి రింకూ ఎంపికపై ఆశలు పెట్టుకున్నాం. సంబురాలు చేసుకునేందుకు స్వీట్లు, పటాకులు తెచ్చిపెట్టుకున్నాం. కానీ మా అంచనాలు తలకింద్రులయ్యాయి. జట్టు ప్రకటించిన తర్వాత రింకూ..తల్లితో బాధగా మాట్లాడాడు’ అని ఒకింత ఆవేదనగా చెప్పాడు.