Malaysia Open : కొత్త ఏడాదిలోనూ భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj), చిరాగ్ శెట్టి(Chirag Shetty) ద్వయం అదరగొడుతోంది. నిరుడు ఆరు టైటిళ్లతో సంచలనం సృష్టించిన ఈ ద్వయం మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో విజృంభించింది. తొలి రౌండ్ నుంచి జోరు కొనసాగించిన భారత ద్వయం క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది.
గురువారం జరిగిన మ్యాచ్లో రెండో సీడ్ సాత్విక్ – చిరాగ్ ఫ్రాన్స్కు చెందిన లూకస్ కొర్వీ, రొనన్ లాబర్పై విజయం సాధించింది. 21-11, 21-18తో చిత్తుగా ఓడించింది. తదుపరి పోరులో భారత జోడీ చైనాకు చెందిన హీ జీ టింగ్, రెన్ గ్జియాంగ్ యూతో తలపడనుంది.
పురుషుల సింగిల్స్లో భారత స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) అనూహ్యంగా రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. రెండో రౌండ్లో హాంకాంగ్ ఆటగాడు కా లాంగ్ అంగుస్ చేతిలో 13-21, 17-21తో ఓటమిపాలయ్యాడు. తొలి సెట్ను భారీ తేడాతో కోల్పోయిన శ్రీకాంత్ రెండో సెట్లో జోరు కొనసాగించాడు. కానీ, అంగుస్ దూకుడైన ఆటతో భారత షట్లర్కు చెక్ పెట్టాడు. ఇప్పటికే హెచ్ ఎస్ ప్రణయ్ వెనుదిరిగిన విషయం తెలిసిందే.