టీమిండియా యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ను టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు అతనికి మొండిచెయ్యి చూపారు. అయితే మరికొన్ని రోజుల్లో న్యూజిల్యాండ్-ఏతో జరిగే వన్డే సిరీస్లో భారత్-ఏ జట్టుకు అతన్నే కెప్టెన్గా ఎంపిక చేశారు. చెన్నై వేదికగా జరగనున్న వన్డే సిరీస్లో భారత జట్టుకు సంజూ శాంసన్ సారధ్యం వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఉమ్రాన్ మాలిక్, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లకు కూడా ఈ జట్టులో చోటుదక్కింది. కాగా, కొన్నిరోజుల క్రితం ముగిసిన ఆసియా కప్లో సంజూకు అవకాశం లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు రిషభ్ పంత్కే అవకాశం ఇచ్చారు. అయితే ఈ టోర్నీలో కూడా పంత్ నిరాశ పరిచాడు. అత్యంత పేలవ ప్రదర్శన చేసిన అతని స్థానంలో టీ20 వరల్డ్ కప్ జట్టులో సంజూకు స్థానం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు మాత్రం పంత్కే అవకాశం ఇచ్చి, సంజూను కనీసం రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో కూడా తీసుకోలేదు.
భారత్-ఏ జట్టు: పృథ్వి షా, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠీ, రజత్ పటీదార్, సంజూ శాంసన్ (కెప్టెన్), కేఎస్ భరత్, కుల్దీప్ యాదవ్, షాబాజ్ అహ్మద్, రాహుల్ చాహర్, తిలక్ వర్మ, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, నవదీప్ సైనీ, రాజ్ అంగద్ బవా
NEWS – India "A" squad for one-day series against New Zealand "A" announced.
Sanju Samson to lead the team for the same.
More details here 👇👇https://t.co/x2q04UrFlY
— BCCI (@BCCI) September 16, 2022