హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో మంగళవారం వారితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. ఇరువురూ దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
న్యాయమూర్తుల కుటుంబసభ్యులు, న్యాయమూర్తులు, న్యాయాధికారు లు, న్యాయవాదులు, సిబ్బంది హాజరయ్యారు. వారిద్దరూ 2022, జూలైలో అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల తర్వాత కేంద్రం గెజిట్ ప్రచురణ నేపథ్యంలో శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.