Sachin Tendulkar : అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో దేశమంతా రామనామ స్మరణతో మార్మోగిపోతోంది. రాముడి విగ్రహాన్ని కండ్లారా చూసేందుకు సినీ, రాజకీయ, క్రీడా దిగ్గజాలు అయోధ్యకు పోటెత్తుతున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) అయోధ్య చేరుకున్నాడు. సోమవారం ముంబై నుంచి అయోధ్యకు విమానంలో బయల్దేరిన సచిన్ మహర్షి వాల్మీకి విమానాశ్రయంలో దిగాడు. అక్కడ ఈ లెజెండరీ క్రికెటర్కు ఘన స్వాగతం లభించింది.
అనంతరం సచిన్ కారులో కొత్తగా నిర్మించిన రామ మందిరా(Ram Temple)నికి వెళ్లాడు. మధ్యాహ్నం 12ః20 గంటలకు జరిగే బాల రాముడి(Ram Lalla) ప్రాణ ప్రతిష్ఠ(Pran Prathishta) కార్యక్రమంలో మాస్టర్ బ్లాస్టర్ పాల్గొననున్నాడు.
Sachin Tendulkar reached Ayodhya#RamMandirPranPrathistha | #AyodhyaRamMandirpic.twitter.com/HuHQE9NxhR
— Don Cricket 🏏 (@doncricket_) January 22, 2024
సచిన్తో పాటు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli), మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే(Anil Kumble), వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, వెంకటేశ్ ప్రసాద్లు కూడా అయోధ్య చేరుకున్నారు. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, రవిచంద్రన్ అశ్విన్లు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరు కానున్నారు.
Virat Kohli’s convoy in Ayodhya 🚩@imVkohli • #RamMandirPranPrathistha • #ViratGang pic.twitter.com/li9z6oq4Qa
— ViratGang.in (@ViratGangIN) January 21, 2024
ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో 51 అడుగుల ఎత్తైన రామ్ లల్లా నల్ల రాతి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కన్నుల పండువగా జరుగనుంది. ఈ వేడుకలో దాదాపు 7 వేలకు మందికి పైగా సెలబ్రిటీలు పాల్గొననున్నారు.