Mukesh Ambani | అయోధ్య (Ayodhya)లో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట (Pran Pratishta) నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముంబైలోని అంబానీ అధికారిక నివాసమైన ఆంటిలియా (Antilia) ‘జై శ్రీ రామ్’ (Jai Shri Ram) నామాలతో విరాజిల్లింది. 27 అంతస్తుల ఈ భవనం మొత్తం రాముడి నామాలతో వెలిగిపోయింది. ఆ ఇంటి ప్రాంగణం కూడా శ్రీరాముడి బ్యానర్లు, లైట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రారంభోత్సవం మరికొన్ని గంటల్లోనే అంగరంగ వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 12:05 నిమిషాల నుంచి 1 గంటల వరకూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు.
#WATCH | Mumbai: Reliance Industries Chairman and MD Mukesh Ambani’s house ‘Antilia’ decked up ahead of the Ram Mandir ‘Pran Pratistha’ ceremony in Ayodhya tomorrow. pic.twitter.com/mKoTRNWZSV
— ANI (@ANI) January 21, 2024
Also Read..
Chiranjeevi | ఫ్యామిలీతో కలిసి అయోధ్య చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి
Ram Mandir | రామ మందిరం నిర్మాణానికి రూ. 52 లక్షలు సేకరించిన బాలిక
Ayodhya | భద్రతా వలయంలో అయోధ్య.. మోహరించిన స్నిపర్స్, యాంటీ బాంబ్ స్క్వాడ్