Chiranjeevi | కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని గంటల్లోనే అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు యావత్ భారతావణి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అయోధ్య బాట పట్టారు.
తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రాణ ప్రతిష్ట కోసం అయోధ్య చేరుకున్నారు. భార్య సురేఖ, కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్య వెళ్లారు. మరోవైపు బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ సహా, సౌత్ సూపర్ స్టార్స్ రజినీకాంత్, ధనుష్, బీటౌన్ తారలు విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ – అలియా భట్, కంగనా రనౌత్, మాధురీ దీక్షిత్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తదితరులు కూడా ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు.
#WATCH | Uttar Pradesh: Telugu superstars Chiranjeevi and Ram Charan arrived at Ayodhya airport.
(Earlier visuals) pic.twitter.com/zXAm5ayV1m
— ANI (@ANI) January 22, 2024
Also Read..
Celebs At Ayodhya | అయోధ్యకు చేరుకుంటున్న సెలబ్రెటీలు.. హనుమాన్ ఆలయంలో అనుపమ్ఖేర్ ప్రత్యేక పూజలు
Sri Ram | తెలుగు తెరపై శ్రీరాముడిగా మెప్పించిన స్టార్స్..!
Ram Mandir | రామ మందిరం నిర్మాణానికి రూ. 52 లక్షలు సేకరించిన బాలిక