Ram Mandir | అహ్మదాబాద్ : గుజరాత్కు చెందిన ఓ 14 ఏండ్ల బాలిక రామమందిర నిర్మాణం కోసం ఏకంగా రూ. 52 లక్షల విరాళాలను సేకరించి ఇచ్చింది. ఇంత చిన్న వయసులో అంత నగదును సేకరించిన బాలికపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సూరత్కు చెందిన 14 ఏండ్ల బాలిక భవికా మహేశ్వరి రామాయణం మీద ఉన్న ఆసక్తితో బాలరాముడి కథలు చదవడం ప్రారంభించింది. ఆ కథలను కొవిడ్ సెంటర్లు, బహిరంగ సభల్లో ప్రజలకు విడమరిచి చెప్పింది.
2021లో ఓ జైలులో ఉన్న ఖైదీలకు రాముడి కథలను చెప్పగా వారు రూ. లక్ష విరాళం ఇచ్చారు. అలా భవికా తాను 11 ఏండ్ల వయసు ఉన్నప్పటి నుంచి 50 వేల కిలోమీటర్లు ప్రయాణించి 300కు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. వాటి ద్వారా మొత్తంగా రూ. 52 లక్షల వరకూ సేకరించి, ఆ నగదును అయోధ్య రామాలయం నిర్మాణం కోసం ఇచ్చింది.