BCCI : భారత క్రికెట్ దిగ్గజాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రత్యేకంగా గౌరవిస్తోంది. విశేష సేవలిందించిన ఆటగాళ్లను ప్రత్యేక బోర్డు రూమ్లు ఏర్పాటు చేస్తోంది. మొన్ననే సునీల్ గవాస్కర్ పేరిట ప్రత్యేక బోర్డ్రూమ్(Board Room) ఏర్పాటు చేసిన బీసీసీఐ.. శనివారం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరిట స్పెషల్ గదిని ప్రారంభించింది. ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో మాస్టర్ బ్లాస్టర్ నూరు శతకాలకు గుర్తుగా ‘SRT 100’ పేరుతో బోర్డు రూమ్ను ఏర్పాటు చేశారు బీసీసీఐ అధికారులు.
తద్వారా సన్నీ తర్వాత బోర్డ్ రూమ్ కలిగిన రెండో భారత క్రికెటర్గా సచిన్ పేరు మార్మోగిపోతోంది. ఈ సందర్భంగా క్రికెట్ లెజెండ్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. ‘నాకు ఈ గౌరవం కల్పించింనందుకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, ఉపాధ్యకుడు రాజీవ్ శుక్లా, సెక్రటరీ సైకియాలకు ధన్యవాదాలు. నా జీవితంలో మొదటిసారి ఇలాంటి ప్రత్యేక గౌరవాన్ని చవిచూస్తున్నాను. ఎందుకంటే.. ముంబైలోనే నా క్రికెట్ కెరియర్ మొదలైంది.
భారత జట్టుకు విశేష సేవలు అందించిన నాపేరిట ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేయడం నా మనసుకెంతో సంతోషాన్నిఇస్తోంది. ఒక ఆటగాడిగా నేను సాధించిన పలు ట్రోఫీల కంటే ఈ రూమ్ నాకు చాలా విలువైనది’ అని సచిన్ తెలిపాడు. తన సొగసైన ఆటతో అంతర్జాతీయ క్రికెట్ను శాసించిన సచిన్.. రికార్డుల వీరుడిగా చరిత్రపుటల్లో చోటు సంపాదించాడు. వన్డేలు, టెస్టుల్లో కలిపి 100 సెంచరీతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. రిటైర్మెంట్ తర్వాత సచిన్ తాను గతంలో ఆడిన ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్గా సేవలందిస్తున్నాడు.
టెస్టుల్లో 10 వేల పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్ సునీల్ గవాస్కర్. రిటైరయ్యాక కామెంటేటర్గానూ రాణిస్తున్న గవాస్కర్కు మే 15 గురువారం బీసీసీఐ ఊహించని కానుక ఇచ్చింది. అతడి పేరుతో బోర్డ్ రూమ్ ఏర్పాటు చేసింది. గదినిండా గవాస్కర్ ఫొటోలు, అతడి కాలంలో టీమిండియా గెలుపొందిన ట్రోఫీలను పొందుపరిచింది బీసీసీఐ. ఈ సందర్బంగా గవాస్కర్ భావోద్వేగానికి లోనయ్యాడు. పేరిట బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక బోర్డ్రూమ్ ఏర్పాటు చేశారు.
Honouring a legend! 🙌
India great Sunil Gavaskar inaugurates 𝟭𝟬𝟬𝟬𝟬 𝗚𝗮𝘃𝗮𝘀𝗸𝗮𝗿 – a Board Room named in his honour and his iconic milestone at the BCCI HQ in Mumbai 👏 pic.twitter.com/laZI0cBL57
— BCCI (@BCCI) May 15, 2025
‘సునీల్ గవాస్కర్ 10000’ అనే పేరుతో దీన్ని రోజర్ బిన్ని, రాజీవ్ శుక్లాలు ప్రారంభించారు. 1987లో పాకిస్థాన్తో అహ్మదాబాద్లో జరిగిన టెస్టులో సన్నీ 10 వేల పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. ఇప్పటికీ భారత్ తరఫున సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక రన్స్ కొట్టిన మూడో క్రికెటర్ అతడే. సచిన్ టెండూల్కర్(15,921 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్ (13,288 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు.