జడ్చర్ల టౌన్, జూలై 25 : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పాత సీహెచ్సీ పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన మిరిచిపోకముందే దవాఖానలోని మందులు చెత్తకుప్పలో పడేసిన ఘటన వెలుగుచూసింది. కల్వకుర్తి రహదారి పక్కన నిర్మించిన నూతన భవనంలోకి 2023లో పాత సీహెచ్సీని షిఫ్ట్ చేశారు. వైద్యపరికరాలతోపాటు మెడిసిన్స్ను కొత్త భవనంలోకి తరలించా ల్సి ఉండగా.. వైద్యాధికారులు నిర్లక్ష్యంగా పాత దవాఖానలోనే వదిలేశారు.
రోగులకు ఉపయోగపడే ఆ మందులు పాత దవాఖాన ఆవరణలోని చెత్తకుప్పలో వెలుగుచూశాయి. ప్రభుత్వం సరఫరా చేసిన మెడిసిన్స్ ఇలా చెత్తకుప్పలో పడేసి రూ.లక్షలు దుర్వినియోగం చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దవాఖాన సూపరింటెండెంట్ హర్షదుల్లాను వివరణ కోరగా.. కరోనా సమయంలో వచ్చిన మందులు రోగులకు పంపిణీ చేశాక కొన్ని మిగిలిపోయాయని, వాటిలో చాలా వరకు ఎక్స్పైరీ కావడంతో అక్కడే ఉంచినట్టు వివరించారు.