ఈ సీజన్ ఐపీఎల్లో విజయం రుచి చూడని ముంబై ఇండియన్స్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్తో తల పడేందుకు సిద్ధమైంది. ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తన 35వ పుట్టిన రోజున మ్యాచ్ ఆడుతున్న ముంబై సారధి రోహిత్ శర్మ.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
అలాగే తమ జట్టులో రెండు కీలక మార్పులు చేసినట్లు వెల్లడించాడు. జయదేవ్ ఉనద్కత్ స్థానంలో కుమార్ కార్తికేయ సింగ్, డెవాల్డ్ బ్రెవిస్ స్థానంల్ టిమ్ డేవిడ్ ఆడుతున్నట్లు తెలిపాడు. రాజస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు లేవని సంజూ శాంసన్ వెల్లడించాడు.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డానియల్ శామ్స్, కుమార్ కార్తికేయ సింగ్, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, రైలీ మెరెడిత్
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్, డారియల్ మిచెల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్
Toss Update from the DY Patil Stadium 🚨@mipaltan have won the toss and have elected to bowl against #RR.#TATAIPL | #RRvMI pic.twitter.com/JxNkUHqEYn
— IndianPremierLeague (@IPL) April 30, 2022