ODI World Cup 2023 : సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్లో భారత జట్టుకు గట్టి పోటీనిచ్చే ప్రత్యర్థి కరువైంది. మెగా టోర్నీలో ఏడు విజయాలతో జోరుమీదున్న రోహిత్ సేన ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో బలమైన దక్షిణాఫ్రికాను రఫ్ఫాడించింది. ఈ మ్యాచ్లో జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చిన హిట్మ్యాన్ ఆ తర్వాత ఫీల్డింగ్లోనూ మెరిశాడు. ఈసారి అతడు బెస్ట్ ఫీల్డర్ మెడల్ అవార్డు(Best Fielder Medal)కు ఎంపికయ్యాడు. సెలబ్రేషన్కు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.
సఫారీలతో మ్యాచ్ అనంతంర ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్(T Dileep) జట్టు సభ్యులను ఉద్దేశించి మాట్లాడాడు. ఈసారి బెస్ట్ ఫీల్డర్ మెడల్ కోసం రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్ నామినేట్ అయ్యారని చెప్పాడు. అనంతరం అందరూ గ్రౌండ్లోకి వచ్చాక.. అక్కడ బగ్గీ కెమెరా(Buggy Camera) హిట్మ్యాన్ వైపు తిరిగింది.
Warning ⚠️
No “Bugs” were harmed in the making of this video 😉
We had a new contender and a new winner this time 🏅 in the City of Joy
Any guesses 🤔 #TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSA
WATCH 🎥🔽 – By @28anand
— BCCI (@BCCI) November 6, 2023
దాంతో, జట్టు సభ్యులంతా చప్పట్లు కొడుతూ రోహిత్ను అభినందించారు. శ్రేయస్ అయ్యర్ అతడికి అవార్డును మెడలో వేశాడు. రోహిత్ ఈ మెడల్ గెలవడం ఇదే మొదటిసారి. అయ్యర్, కేఎల్ రాహుల్ మాత్రమే రెండుసార్లు ఈ మెడల్ అందుకున్నారు.
కోహ్లీ (101 నాటౌట్)
వరల్డ్ కప్లో ఓటమన్నదే ఎరుగని భారత్ కోల్కాతాలో సఫారీలను ఓ ఆట ఆడుకుంది. కోహ్లీ సెంచరీ(101 నాటౌట్), అయ్యర్(77) దంచికొట్టడంతో బవుమా బృందానికి 327 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ల నుంచి ఏడో స్థానం వరకూ హిట్లర్లతో నిండిన సఫారీ జట్టు జడేజా, షమీ దెబ్బకు చేతులెత్తేసింది. 83 రన్స్కే ఆలౌట్ కావడంతో భారత్ 243 పరగులు భారీ తేడాతో విజయం సాధించింది.