Hyderabad Rains | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో వనస్థలిపురంలోని చింతల్కుంట వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా నీరు చేరి చెరువును తలిపిస్తోంది. దీంతో పనామా-ఎల్బీనగర్ మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ ఆదేశించారు. హైదరాబాద్ వర్షాలపై జోనల్ కమిషనర్లు, ఎస్ఈలతో మేయర్ విజయలక్ష్మి శనివారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాలు, నాలాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
ఎల్బీనగర్ చింతలకుంటలో భారీ వర్షం. విజయవాడ రహదారిపై నిలిచిన నీరు.. భారీగా స్తంభించి ట్రాఫిక్#HyderabadRains #LBnagar #Newsupdates #bigtvlive pic.twitter.com/JavgtDXsmi
— BIG TV Breaking News (@bigtvtelugu) May 18, 2024