Rishabh Pant :టెస్టు ఫార్మాట్లో ఇంగ్లండ్ జట్టు బజ్బాల్(Buzz Ball) ఆట ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. బ్రెండన్ మెక్కల్లమ్ కోచ్గా, బెన్ స్టోక్స్ కెప్టెన్గా ఎంపికయ్యాక ఇంగ్లీష్ జట్టు ఆటే మారిపోయింది. తాజాగా భారత పర్యటనలోనూ స్టోక్స్ సేన అదే గేమ్తో తొలి టెస్టులో గెలుపొందింది. ఈ పరిస్థితుల్లో బజ్బాల్కు కౌంటర్ చేయాల్సిన టైమ్ వచ్చిందని కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) బజ్బాల్కు కౌంటర్ బాల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
స్టార్ స్పోర్ట్స్ ‘బిలీవ్ టు డెత్ అండ్ బ్యాక్'(Believe to death and back) షోలో మాట్లాడిన పంత్.. నిరుడు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన యాషెస్ సిరీస్(Ashes Series)ను గుర్తు చేసుకున్నాడు. ‘ఇంగ్లండ్ జట్టు ఒకరకమైన కొత్త ఆటతో అదరగొడుతోంది. దాదాపు నేను దూకుడుగా ఆడినట్టే ఆడుతోంది.
Rishabh Pant narrates incident of fan chanting Dhoni Dhoni..
Rishabh Pant 🗣️” Why should their be comparison.I use to feel very bad, I used to go back in room and cry.” “At the age of 20-21 due to so much pressure , I felt I couldn’t breathe”#RishabhPant pic.twitter.com/HoBxkv6DYC
— Naman (@NAMAN_17__) February 1, 2024
ఇదే విషయమై నాతో రోహిత్ భాయ్ ఏం అన్నాడంటే..? ‘మనం కూడా రిషి బాల్ ఆడుదాం. నువ్వు ఎలాగూ ధనాధన్ ఆడుతావు కదా. ఇకపై నిన్ను అందరూ అనుసరించేలా చేద్దాం’ అని సరదాగా అనేవాడు’ అని పంత్ వెల్లడించాడు. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో పంత్ ఓ రేంజ్లో చితకబాదాడు. సిడ్నీ టెస్టులో 97 పరుగులతో ఓటమి నుంచి గట్టెక్కించాడు.
గబ్బా టెస్టులో భారత్ను ఒంటిచేత్తో గెలిపించిన పంత్
చివరిదైన గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్లో (89 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్తో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దాంతో, భారత్ గబ్బాలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రెండేండ్ల క్రితం కారు యాక్సిడెంట్లో గాయపడిన పంత్ ఆటకు దూరమై దాదాపు 14 నెలలు అవుతోంది.
పంత్, రోహిత్, మెక్కల్లమ్, స్టోక్స్
మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న ఈ డాషింగ్ బ్యాటర్ ఐపీఎల్ 17వ సీజన్(IPL 2024)తో పునరాగమనం చేయనున్నాడు. టోర్నీకి మరో నెల రోజులే ఉండడంతో ఫిట్నెస్పై దృష్టి పెట్టిన పంత్ జిమ్లో చెమటోడ్చుతున్నాడు.