Rinku Singh : ఐపీఎల్ 16వ సీజన్ హీరో రింకూ సింగ్(Rinku Singh) సంతోషానికి అవధులు లేవు. అతడి కల నిజమయ్యే రోజు రానే వచ్చింది. ఐర్లాండ్ సిరీస్(Ireland Series)కు ఎంపికైన అతను భారత జట్టు తరఫున రేపు టీ20ల్లో అరంగేట్రం చేయనున్నాడు. క్రికెటర్గా ఎదిగేక్రమంలో ఎన్నో కష్టాలు అనుభవించిన రింకూ తొలిసారి విమానంలో బిజినెస్ క్లాస్(Business Class)లో ప్రయాణించాడు. దాంతో, అతడి ఆనందానికి అవధులు లేవు. తన మొదటి బిజినెస్ క్లాస్ జర్నీ అనుభవాన్ని రింకూ జితేశ్ శర్మ(Jitesh Sharma)తో పంచుకున్నాడు. బీసీసీఐ పోస్ట్ చేసిన ఆ వీడియోలో ఈ సిక్సర్ల కింగ్ ఏం చెప్పాడంటే..?
‘చాలా హ్యాపీగా ఉంది. టీమిండియాకు ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. నా రూమ్లోకి వెళ్లి నా పేరుతో ఉన్న 35 నంబర్ జెర్సీ చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యా. ఈ రోజు కోసమే నేను ఎంతో కష్టపడ్డాను’ అని అన్నాడు. రింకూ, జితేశ్ శర్మ ఇద్దరూ 2013లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒకేసారి ఆడారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ భారత జట్టుకు ఆడుతున్నారు. భారత్, ఐర్లాండ్ మధ్య ఆగస్టు 18న మొదటి టీ20 జరుగనుంది.
From emotions of an India call-up to the first flight ✈️ & Training session with #TeamIndia 😃
𝗪𝗵𝗲𝗻 𝗱𝗿𝗲𝗮𝗺𝘀 𝘁𝗮𝗸𝗲 𝗳𝗹𝗶𝗴𝗵𝘁 ft. @rinkusingh235 & @jiteshsharma_ 👌👌 – By @RajalArora
Full Interview 🎥🔽 #IREvINDhttps://t.co/m4VsRCAwLk pic.twitter.com/ukLnAOFBWO
— BCCI (@BCCI) August 17, 2023
భారత బృదం : జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్ కృష్ణ, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, శివం దూబే, షహబాజ్ అహ్మద్, సంజూ శాంసన్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్.
భారత్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల పొట్టి సిరీస్ ఆగస్టు 18న మొదల్వనుంది. రెండో మ్యాచ్ 20న, మూడో టీ20 23వ తేదీన జరుగనున్నాయి. ఆసియా కప్(Asia Cup), వన్డే వరల్డ్ కప్(odi wc 2023) వంటి మెగా టోర్నీలకు ముందు జరుగుతున్న ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు ఎంతో కీలకం.