WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్(WPL 2024) రసవత్తరంగా సాగుతోంది. ఉత్కంఠభరిత మ్యాచ్లు అభిమానులను మునివేళ్లపై నిలబెడుతున్నాయి. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మధ్య జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్ వరకూ విజయం ఇరుజట్లతో దోబూచులాడింది. చివరకూ ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంది.
దాంతో, ఢిల్లీ జట్టు సంబురాల్లో మునిగిపోగా… జట్టును గెలిపించలేకపోయామనే బాధతో ఆర్సీబీ అమ్మాయిలు రీచా ఘోష్(51), శ్రేయాంక పాటిల్(o)లు కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్లిద్దరిని ఢిల్లీ ప్లేయర్లు ఓదార్చుతున్న వీడియో వైరల్ అవుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 185 రన్స్ చేసింది. ఓపెనర్లు షఫాలీ, లానింగ్ విఫలమైనా జెమీమా రోడ్రిగ్స్(58), అలిసే క్యాప్సే(48)లు దంచికొట్టారు. దాంతో, ఆర్సీబీకి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారీ ఛేదనలో మంధాన(5) నిరాశపరిచింది.
Another Classic in #TATAWPL @DelhiCapitals win the match by 1 RUN! They jump to the top of points table 🔝
Scoreboard 💻 📱 https://t.co/b7pHKEKqiN#DCvRCB pic.twitter.com/znJ27EhXS6
— Women’s Premier League (WPL) (@wplt20) March 10, 2024
అయితే.. ఎలీసా పెర్రీ(49), ఆ తర్వాత రీచా ఘోష్(51)లు అద్భుతంగా ఆడి ఆర్సీబీని గెలుపు వాకిట నిలిపారు. కానీ, చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. రీచా రెండు సిక్సర్లు బాదినా చివరి బంతికి ఔట్ అయింది. దాంతో, ఆమె మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకుంది. నాన్స్ట్రయికర్ శ్రేయాంక కూడా ఓటమి బాధతో కుమిలిపోయింది.
WHAT. A. KNOCK 👏👏
Live 💻 📱 https://t.co/b7pHKEKqiN#TATAWPL | #DCvRCB pic.twitter.com/8raWMOZLOP
— Women’s Premier League (WPL) (@wplt20) March 10, 2024
ప్లే ఆఫ్స్ ముందు కీలక మ్యాచ్లో ఓడడం తమను ఎంతో బాధించిందని మంధాన మ్యాచ్ అనంతరం తెలిపింది. ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు చేరగా.. రన్నరప్ ఢిల్లీ రెండో బెర్తు సాధించింది. దాంతో, మూడో బెర్తు కోసం ఆర్సీబీకి యూపీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.