Sports
- Jan 12, 2021 , 16:36:53
జడేజా సర్జరీ సక్సెస్..

సిడ్నీ: టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. మంగళవారం 32ఏండ్ల జడేజా బొటనవేలికి నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఎడమచేతి బొటనవేలికి సర్జరీ అనంతరం చేతికి పట్టితో ఉండగా తీసిన ఫొటోను ట్విటర్లో షేర్ చేసిన జడేజా త్వరలో తిరిగి వస్తానని పేర్కొన్నాడు.
'కొద్దిరోజులు ఆటకు దూరంగా ఉంటా. శస్త్రచికిత్స పూర్తైంది. కానీ, త్వరలోనే రెట్టించిన బలంతో తిరిగొస్తానని' జడ్డూ ట్వీట్ చేశాడు. జడేజా ట్వీట్పై బీసీసీఐ స్పందించింది. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేసింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన నాలుగో టెస్టు బ్రిస్బేన్ వేదికగా జనవరి 15-19 మధ్య జరగనుంది.
Wishing you a speedy recovery ???? https://t.co/4G9m6xrdzK
— BCCI (@BCCI) January 12, 2021
తాజావార్తలు
- ఫ్యూచర్పై హీరో ‘ఐ’.. త్వరలో విద్యుత్ కారు
- సీడీకె గ్లోబల్ వర్ట్యువల్ కన్వర్జెన్స్ -2021
- కరోనా క్రైసిస్ ఉన్నా.. స్టార్టప్లు భేష్!!
- బంద్ కానున్న గూగుల్ డ్యుయో సేవలు..?
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
MOST READ
TRENDING