శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దుమ్ము దులిపాడు. బంతి, బ్యాటుతో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో జడ్డూ 175 పరుగులతో అజేయంగా నిలవడమే కాకుండా.. 9 వికెట్లు కూడా పడగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత చాలా మంది మాజీలు జడ్డూపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా జడ్డూను మెచ్చుకున్నాడు.
‘‘ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్ జడేజానే. దీనిలో వాదించడానికేమీ లేదు. అతని బ్యాటింగ్ మెరుగైన విధానం చూస్తుంటే విదేశాల్లో అయినా సరే ఏడో స్థానంలో అతను అద్భుతంగా రాణించగలడని అర్థమవుతోంది. జట్టు అతనిపై నమ్మకం పెంచుకుంటుంది. దీనివల్ల ఇద్దరు స్పిన్నర్లను ఆడించి, వాళ్లను మరింత ప్రమాదకరంగా మార్చే అవకాశం టీమిండియాకు దక్కుతుంది’’ అని వసీం జాఫర్ అన్నాడు.
జడేజా కచ్చితంగా ‘ఏ+’ గ్రేడ్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాడి ప్రదర్శన కనబరిచాడుని మెచ్చుకున్నాడు. మొహాలీ టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు.. రెండు టెస్టుల సిరీసులో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు బెంగళూరు వేదికగా జరుగుతుంది. ఇది పింక్ బాల్ టెస్టు కావడం గమనార్హం.
Ravindra Jadeja can:
Turn a match with his fielding
Win a match with the bat
Win a series with the ballThe perfect all rounder. Very well batted today @imjadeja 👏🏼 #INDvSL pic.twitter.com/Ka5xAGZYU5
— Wasim Jaffer (@WasimJaffer14) March 5, 2022