మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇండియాన భారీ స్కోర్ చేసింది. ఇవాళ రెండవ రోజు రెండవ సెషన్లో ఇండియా 578 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా అత్యధికంగా 175 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 17 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి షమీ 20 రన్స్తో నాటౌట్గా ఉన్నాడు. స్పిన్నర్ అశ్విన్ 61 రన్స్ చేసి ఔటయ్యాడు. లంక బౌలర్లలో సురంగ, ఫెర్నాండో, లసిత్లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. టీ బ్రేక్ తర్వాత శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ను ఆరంభించింది. తిరుమణే, కరుణరత్నేలు బ్యాటింగ్ చేస్తున్నారు.
స్కోర్ బోర్డు
ఇండియా 574-8
జడేజా 175 నాటౌట్, పంత్ 96, విహారి 58
Here comes the declaration and that will also be Tea on Day 2 of the 1st Test.
Ravindra Jadeja remains unbeaten on 175.#TeamIndia 574/8d
Scorecard – https://t.co/c2vTOXSGfx #INDvSL @Paytm pic.twitter.com/yBnZ2mTeku
— BCCI (@BCCI) March 5, 2022