Ranji Trophy 2024 | నేటి నుంచి మొదలైన రంజీ ట్రోఫీ ఫైనల్లో 41 సార్లు ఈ ట్రోఫీ ఛాంపియన్ ముంబైకి విదర్భ షాకిచ్చింది. ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న ఫైనల్లో టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ముంబై.. 64.3 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌట్ అయింది. రంజీ సెమీస్లో సెంచరీ చేసి ముంబైని ఆదుకున్న శార్దూల్.. ఫైనల్లోనూ ఆ జట్టుకు ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. 69 బంతుల్లోనే 8 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో శార్దూల్.. 75 రన్స్ చేశాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన ముంబైకి ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్ లల్వాని (37) లు శుభారంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరూ తొలి వికెట్కు 81 పరుగులు జోడించారు. కానీ స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్ అయిన తర్వాత ముంబై ఇన్నింగ్స్ కుదుపునకు లోనైంది. ముషీర్ ఖాన్ (6), కెప్టెన్ అజింక్యా రహానే (7), శ్రేయస్ అయ్యర్ (7), హార్ధిక్ తమోర్ (5), శామ్స్ ములాని (13)లు విఫలమయ్యారు.
A SOLID FIGHTBACK BY SHARDUL THAKUR….!!!!
75 (69) with 8 fours and 3 sixes when Mumbai were in massive trouble. He scored a century in the Semis and now a gritty 75 in the Final. 👏 pic.twitter.com/rUCQu4er7E
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 10, 2024
ఏడో స్థానంలో వచ్చిన శార్దూల్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన అతడు.. భారీ షాట్లు ఆడి విదర్భ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ టీ విరామం తర్వాత కొద్దిసేపటికే ముంబై.. ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన విదర్భ.. మూడో ఓవర్లోనే తొలి వికెట్ను కోల్పోయింది. బ్యాటింగ్లో ముంబైని ఆదుకున్న శార్దూల్.. బౌలింగ్లోనూ ముంబైకి తొలి బ్రేక్ ఇచ్చాడు. అతడు వేసిన మూడో ఓవర్లో ద ఓపెనర్ ధ్రువ్ షోరే డకౌట్ అయ్యాడు.