Ranji Trophy: దేశవాళీ క్రికెట్లో భాగంగా గురువారం నుంచి మొదలైన రంజీ ట్రోఫీలో ముంబై జట్టు.. బిహార్తో తలపడుతున్నది. శుక్రవారం తొలి రోజు ఆటలో భాగంగా పాట్నాలో మ్యాచ్ మొదలుకాకముందు బిహార్ తరఫున ఏకంగా రెండు జట్లు ‘మేం మ్యాచ్ ఆడతాం అంటే మేం ఆడతాం..’ అని పోటాపోటీగా ప్రకటించడం అంపైర్లకు కొత్త తలనొప్పులను తీసుకొచ్చింది. బిహార్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ)లో విభేదాలను ఎత్తిచూపుతూ ప్రెసిడెంట్, సెక్రటరీలు వేర్వేరుగా జట్లను ప్రకటించడం విస్మయానికి గురిచేసింది. చివరికి పోలీసులు వచ్చి జోక్యం చేసుకున్నాక సమస్య పరిష్కారమైంది.
వివరాల్లోకెళ్తే.. బిహార్ – ముంబై మధ్య పాట్నా లోని మోయిన్ ఉల్ హక్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉండగా తుది జట్లను ప్రకటించే సమయంలో బీసీఏ ప్రెసిడెంట్, సెక్రటరీలు జట్లు గ్రౌండ్లోకి వచ్చాయి. దీంతో గ్రౌండ్లో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. బీసీఏ ప్రెసిడెంట్ రాకేశ్ తివారి.. సెకట్రరీ అమిత్ కుమార్లు పోటాపోటీగా జట్లను ప్రకటించడంతో అసలు ముంబైతో ఆడబోయే జట్టు ఏదని అంపైర్లు తలలు పట్టుకున్నారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి సెక్రటరీ అమిత్ కుమార్ వర్గం సభ్యులను అక్కడ్నుంచి పంపించేయడంతో ముంబై జట్టు.. రాకేశ్ తివారి ప్రకటించిన బిహార్ జట్టుతో మ్యాచ్ ఆడుతోంది.
There was a dispute in Patna during the Ranji Trophy as two different teams claimed to represent Bihar. The President’s team played as they arrived early, but the Secretary questioned the President’s authority, comparing it to the selection of the BCCI squad. (Indian exp.) pic.twitter.com/fHKofPN9r6
— Vipin Tiwari (@Vipintiwari952_) January 5, 2024
కాగా ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్లో 251 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై బ్యాటర్లు భూపేన్ లల్వాని (65), సువేద్ పార్కర్ (50)తో పాటు తనూశ్ కొల్టన్ (50)లు రాణించారు. బిహార్ బౌలర్లలో వీర్ ప్రతాప్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగాడు.