ఢిల్లీ: కొద్దిరోజుల క్రితమే బిష్కెక్ వేదికగా ముగిసిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో తీవ్రంగా నిరాశపరిచి ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకోలేకపోయిన రెజ్లర్లే త్వరలో ఇస్తాంబుల్ (టర్కీ)లో జరుగబోయే వరల్డ్ ఒలింపిక్ గేమ్స్ క్వాలిఫయర్స్లోనూ బరిలోకి దిగనున్నారు. మే 9-13 మధ్య జరగాల్సి ఉన్న ఈ పోటీలే భారత మల్ల యోధులకు ఒలింపిక్స్లో కోటా ఖాయం చేసుకోవడానికి ఉన్న చివరి అవకాశం.
బిష్కెక్లో వినేశ్ ఫోగట్, అన్షు మాలిక్, రీతిక మినహా మిగిలిన రెజ్లర్లు విఫలమయ్యారు. దీంతో తిరిగి సెలెక్షన్స్ ట్రయల్స్ నిర్వహించి వారిని ఇస్తాంబుల్కు పంపాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) భావించినా సమయం తక్కువగా ఉండటంతో బిష్కెక్ టీమ్నే ఎంపికచేసింది.