IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) చేజేతులా క్వాలిఫయర్ 1లో ఆడే చాన్స్ కోల్పోయింది. వరుసగా నాలుగు ఓటములతో నిరాశపరిచిన రాజస్థాన్కు ‘ప్లే ఆఫ్స్’ చేరిన సంతోషం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ఫ్రాంచైజీ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది. వర్షం కారణంగా రద్దయిన ‘గువాహటి’ మ్యాచ్(Guwahati Match) టికెట్ల పైసల్ని వాపస్ చేస్తున్నట్టు ప్రకటిచింది. దాంతో, ‘హమ్మయ్యా.. మన పైసలు మనకు వస్తున్నయ్’ అంటూ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.
పదిహేడో సీజన్ ఆరంభంలో అదరగొట్టిన రాజస్థాన్ ఆ తర్వాత డీలా పడింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి టాప్ 3కి పరిమితమైంది. ఇక చివరిదైన లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)పై గెలవాలనుకున్న సంజూ సేనకు వరుణుడు షాకిచ్చాడు. దాదాపు మూడున్నర గంటల తర్వాత టాస్ వేసి 7 ఓవర్ల మ్యాచ్ ఉంటుందని అంపైర్లు చెప్పిన కాసేపటికే వాన అందుకుంది.
Rain 🌧️ has the final say in Guwahati and the #RRvKKR clash has been abandoned.#TATAIPL pic.twitter.com/oAfpbBuJxH
— IndianPremierLeague (@IPL) May 19, 2024
దాంతో, అంపైర్లు ఇక ఆట సాధ్యం కాదని ఇరుజట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. రాజస్థాన్ 17 పాయింట్లు సాధించినా నెట్రన్ రేటులో ముందున్న సన్రైజర్స్(SRH) రెండో స్థానంలో నిలిచింది. మే 22న జరిగే ఎలిమినేటర్లో రాజస్థాన్ జట్టు ఆర్సీబీతో తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడితే సంజూ సేనకు ఇంటిదారి తప్ప వేరే దారిలేదు. అందుకని రాజస్థాన్ టీమ్ ఈ మ్యాచ్ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది.