Suresh Raina : సొంత గడ్డపై భారత జట్టు మరో ట్రోఫీని ఒడిసిపట్టుకోవాలనే కసితో ఉంది. కోట్లాదిమంది అభిమానులు టీమిండియా విజయాన్ని కాంక్షిస్తున్న వేళ మాజీ ఆటగాడు సురేశ్ రైనా(Suresh Raina) కూడా తన మనసులోని మాటను పంచుకున్నాడు. తన జీవితంలో 2011 ఏప్రిల్ 2 మర్చిపోలేని రోజని, భారత జట్టుకు మరొక గుర్తిండిపోయే రాత్రి కావాలని రైనా అన్నాడు. అంతేకాదు టీమిండియా ఆటగాళ్లు వరల్డ్ కప్ ట్రోఫీ సెలబ్రేట్ చేసుకునే చాన్స్ రావాలి అని రైనా ఆశాభావం వ్యక్తం చేశాడు.
భారత జట్టు స్టార్ ఆల్రౌండర్గా పేరొందిన రైనా యువరాజ్ సింగ్తో కలిసి ఎన్నో విజయాల్లో భాగమయ్యాడు. అంతేకాదు స్వదేశంలో 12 ఏండ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రైనా సభ్యుడు. ముంబైలోని వాంఖడేలో గంభీర్(91), మహీ(97) ధనాధన్ ఇన్నింగ్స్లతో భారత్ అలవోకగా లంకను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
The best day of my life was April 2, 2011. India want another night to remember and I want my brothers to give as a chance to celebrate! Cheering for you on @aajtak pic.twitter.com/OA4ZGXuyJu
— Suresh Raina🇮🇳 (@ImRaina) November 19, 2023
మెగా టోర్నీలో వరుస విజయాలతో రోహిత్ సేన ఫైనల్కు దూసుకెళ్లింది. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్లు గెలిచిన భారత్… సెమీస్లో 2019 రన్నరప్ న్యూజిలాండ్ను 70 పరుగుల తేడాతో మట్టికరిపించింది. అయితే.. టైటిల్ పోరులో టాస్ ఓడిన భారత్ను పవర్ ప్లేలో ఆసీస్ బౌలర్లు హడలెత్తించారు. రాహుల్(66), విరాట్ కోహ్లీ(58), రోహిత్ (47) విలువైన పరుగులు చేయడంతో 50 ఓవర్లలో 240కి పరిమితమైంది.