Rahul Gandhi | రెజ్లింగ్ క్రీడాకారులతో (Wrestlers) కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం భేటీ అయ్యారు. హర్యాణాలోని (Haryana) ఝజ్జర్ జిల్లాకు చెందిన వీరేందర్ అఖాడాలో ప్రాక్టీస్లో ఉన్న రెజ్లర్లను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బజరంగ్ పునియా తమ సమస్యలను రాహుల్కు విన్నవించారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ప్రెసిడెంట్గా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక రెజ్లర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలకు నిరసనగా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లు తమ అవార్డులను వాపస్ ఇచ్చేశారు. సంజయ్ ఎన్నికపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. బజరంగ్ పునియా, వీరేందర్ యాదవ్ పద్మశ్రీ అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. ఖేల్రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వినేశ్ ఫొగాట్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ వారిని కలిసి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా.. రెజ్లర్ల నిరసన నేపథ్యలో అలర్ట్ అయిన కేంద్రం.. సంజయ్ సింగ్ ప్యానెల్ను సస్పెండ్ చేసింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కూడా తనకు రెజ్లింగ్తో ఏం సంబంధం లేదని, ఈ ఆటకు ఇక సెలవు అని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
#WATCH | Haryana: Congress MP Rahul Gandhi reaches Virender Arya Akhara in Chhara village of Jhajjar district and interacts with wrestlers including Bajrang Poonia. pic.twitter.com/j9ItihwVvP
— ANI (@ANI) December 27, 2023
Also Read..
Rahul Gandhi | భారత్ న్యాయ యాత్రకు సిద్ధమైన రాహుల్
Dense Fog | ఢిల్లీ గజగజ.. 110 విమాన రాకపోలకు అంతరాయం
Lee Sun-kyun: పారాసైట్ చిత్ర నటుడు లీ కున్ అనుమానాస్పద మృతి