Rahul Dravid : ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్(England)తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు చేజేతులా ఓడిపోయింది. తొలి రెండు రోజులు మ్యాచ్పై పట్టుబిగించిన టీమిండియా.. ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఓలీ పోప్(Ollie Pope) బజ్బాల్ అటాక్తో వెనకబడింది. రెండో ఇన్నింగ్స్లో కనీసం పోరాడకుండానే మ్యాచ్ అప్పగించేయడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. గెలవాల్సిన మ్యాచ్ చేజారడంపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్పందించాడు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇంగ్లండ్ బజ్బాల్ ఆటను కౌంటర్ చేయాల్సిన టైమ్ వచ్చిందని అన్నాడు.
‘ఇంగ్లండ్ జట్టు బజ్బాల్ ఆటకు కౌంటర్ అటాక్ ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. సిరీస్లో మిగిలిన నాలుగు టెస్టుల్లో ఇంగ్లండ్ వ్యూహాన్ని తిప్పికొడుతాం. అయితే.. వరల్డ్ క్లాస్ బౌలర్లు అయిన అశ్విన్, జడేజా బౌలింగ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు తరచూ రివర్స్ స్వీప్, స్వీప్ షాట్లు ఆడడం నేను ఇప్పుడే చూస్తున్నా. భారత స్పిన్నర్లకు కఠిన సవాల్ ఎదురవ్వడం ఇదే మొదటిసారి కాదు’ అని ద్రవిడ్ తెలిపాడు.
England overturn a first-innings deficit of 190 runs for one of the great victories in India!https://t.co/WzuwYpQ2Rp | #INDvENG pic.twitter.com/PbdbmbraHe
— ESPNcricinfo (@ESPNcricinfo) January 28, 2024
ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొల టెస్టులో ఇంగ్లండ్ సంచలన విజయం సాధించింది. ఓలీ పోప్(196) వీరోచిత సెంచరీ బాదడంతో పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్లో 420 రన్స్ కొట్టింది. అనంతరం 231 పరుగుల ఛేదనకు దిగిన టీమిండియా ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. అరంగేట్రం స్పిన్నర్ టామ్ హర్ట్లే తన సూపర్ బౌలింగ్తో యశస్వీ జైస్వాల్(15), శుభ్మన్ గిల్(0)లను ఔట్ చేసి భారత్ను ఒత్తిడిలోకి నెట్టాడు.
An innings for the ages by Ollie Pope in Hyderabad ✨ #INDvENG pic.twitter.com/4501QC3c7H
— ESPNcricinfo (@ESPNcricinfo) January 28, 2024
ఆ తర్వాత కాసేపటికే రోహిత్ శర్మ(39) ఎల్బీగా వెనక్కి పంపి మ్యాచ్ను మలుపు తిప్పాడు. శ్రేయస్ అయ్యర్(13) మరోసారి విఫలమవ్వగా.. తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్(28), అశ్విన్(28)లు పోరాడినా ఓటమి తప్పించలేకపోయారు. సూపర్ స్పెల్తో ఇంగ్లండ్ను గెలిపించిన హర్ట్లే అత్త్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు విశాఖపట్టణంలో ఫిబ్రవరి 2న జరుగనుంది.