NarsaReddy | హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత పి. నర్సారెడ్డి(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నర్సారెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నర్సారెడ్డి స్వస్థలం నిర్మల్ జిల్లా మలక్చించోలి గ్రామం. 1970-71 మధ్య కాలంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు నర్సారెడ్డి.