Plane Crash | బ్రెజిల్లోని ఈశాన్య రాష్ట్రం మినాస్ గైరోస్లో జరిగిన విమాన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకున్నది. సావోపాలోలోని కంపినాస్ నగరం నుంచి బయలుదేరిన బుల్లి వమానం కుప్ప కూలింది. ఈ విమానం సింగిల్ ఇంజిన్తో నడుస్తుంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు మైనింగ్ నగరంగా పేరొందిన ఇటాపెవా పరిధిలో గాలిలోనే పేలిపోయి ముక్కలైంది. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక దళ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు వ్యక్తులు మరణించారని చెప్పారు. తొలుత మూడు మ్రుతదేహాలను వెలికి తీశామని అధికారులు తెలిపారు విమాన శకలాలు పర్వతం పక్కనే ఉన్న చెట్లపై, గడ్డిపై పడిపోయాయని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.