IPL 2023 : పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు గుడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ లియం లివింగ్స్టోన్(Liam Livingstone) త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. స్వదేశంలో ఉన్న అతను మరో రెండు రోజుల్లో భారత్కు రానున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ‘నేను గత వారం తీసుకున్న ఇంజక్షన్లు చాలా అద్భుతంగా పనిచేశాయి. మరో 48 గంటల్లో నేను ఇండియాకు బయలుదేరనున్నాను’ అని లివింగ్స్టోన్ తెలిపాడు. లాంక్షైర్ క్రికెట్ అతడి వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ ఆల్రౌండర్ రాకతో పంజాబ్ బ్యాటింగ్, బౌలింగ్ యూనిట్ మరింత బలోపేతం కానుంది.
మోకాలు, కాలిమడమ గాయంతో బాధ పడుతున్న లివింగ్స్టోన్ పూర్తిగా కోలుకున్నాడు. దాంతో, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB), లాంక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్(LCCC) అతడు ఐపీఎల్లో ఆడేందుకు ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ కూడా ఇచ్చాయి. అయితే.. ఫిట్నెస్ పరీక్ష కోసం అతను కొన్ని కౌంటీ మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. అందుకని ఈ స్టార్ ఆల్రౌండర్ ఐపీఎల్ 16వ సీజన్లో మూడు మ్యాచ్లు మిస్ అయ్యాడు. లివింగ్ స్టోన్ను 2022 మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసింది.
“I had injections last week and they’ve worked their magic, so hopefully in the next 48 hours I’ll be on my way out to India.”
An update from @liaml4893 on his @PunjabKingsIPL arrival. 🇮🇳
Keep an eye out for our new #LancsTV @IPL show, featuring @katecross16 & Livi! pic.twitter.com/MRNLTYtZfn
— Lancashire Cricket (@lancscricket) April 9, 2023
ఈ సీజన్లో వరుసగా రెండు విజయాలతో ఊపు మీదున్న శిఖర్ ధావన్ సేనకు సన్ రైజర్స్ హైదరాబాద్(SundRisers Hyderabad) షాకిచ్చింది. సొంత మైదానం అయిన ఉప్పల్ స్టేడయంలో హైదరాబాద్ బౌలర్లు చెలరేగారు. దాంతో, పంజాబ్ 143 రన్స్కే పరిమితమైంది. శిఖర్ ధావన్ (99 నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు. రాహుల్ త్రిపాఠి (74) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో మర్క్రం సేన 8 వికెట్ల తేడాతో గెలిచింది. వరుస పరాజయాలకు ముగింపు పలికింది. పంజాబ్ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 13న గుజరాత్ టైటన్స్ను ఢీ కొట్టనుంది.