PSL 2024 : వచ్చే ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2024) నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. పాక్లో సరిగ్గా అదే సమయంలో జనరల్ ఎలక్షన్(General Eelection) జరుగనుండడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ఇతర దేశాల్లో పీఎస్ఎల్ పోటీలను నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది.
దాంతో, టోర్నీలో 15 మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లేదా దక్షిణాఫ్రికాలో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) ప్లాన్ చేస్తోంది. అయితే.. విదేశాల్లో టోర్నీ నిర్వహణకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని పీసీబీ అధికారులు వాపోతున్నారు.
షెడ్యూల్ ప్రకారం.. వచ్చే సీజన్ పీఎస్ఎల్ 2024 ఫిబ్రవరి 8 నుంచి మార్చి 24 వరకు జరగాల్సి ఉంది. ఫిబ్రవరిలోనే పాక్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో, ఈసారి పాక్ గడ్డపై కాకుండా వేరే చోట టోర్నీని నిర్వహించాల్సి రావొచ్చు. అయితే.. ఎన్నికల తేదీల గురించి ప్రభుత్వాన్ని అడిగాం. ఆ తర్వాతే టోర్నీ వేదికను ప్రకటిస్తాం అని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈసారి లాహోర్ కాలండర్స్ జట్టు డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది.